ఒకే బైక్‌పై ఆరుగురు యువకులు.. వెంటపడి పట్టుకున్న పోలీసులు 

ఒకే బైక్‌పై ఆరుగురు యువకులు.. వెంటపడి పట్టుకున్న పోలీసులు 

బైక్​ పై ఒకరిద్దరు ప్రయాణించడం సాధారణం.. ముగ్గురు అంటేనే ట్రాఫిక్​ రూల్స్​ ఒప్పుకోవు.. అలాంటిది ఒక్క బైక్ పై ఒకేసారి ఆరుగురు యువకులు  ప్రయాణించడం అంటే  ఊహించుకోండి  ఎలా ఉంటుందో..  సోషల్​ మీడియాలో బైకుపై  ఆరుగురు యువకులు వెళ్తున్న వీడియో వైరల్​అవుతోంది. ఇప్పుడు దీనిగురించే పెద్ద చర్చ.. ఒకే బండిపై ఇంతమంది ఎలా కూర్చుకున్నారు?.. బండి నడిపేవాడు  ఎలా నడిపాడు.. జరగరానికి  ఏదైనా జరిగితే  ఏంటీ పరిస్థితి? .. అని ప్రాణాలు తీస్తున్న ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.  

ఆంధ్రప్రదేశ్​ లోని సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ చిలమత్తూరు పోలీస్ స్టేషన్​ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒకే బైక్​ పై ఆరుగురు యువకులు ప్రయాణిస్తూ పట్టుబడ్డారు. పోలీసులను చూసి  తప్పించుకునేందుకు ప్రయత్నించారు. బైక్​ వేగం పెంచారు. పోలీసులు వెంబడించి బైక్​ ఛేజ్​చేసి మరీ పట్టుకున్నారు. తమదైన శైలీలో యువకులకు కౌన్సిలింగ్​ఇచ్చారు.  

యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తీరు కూడా ఆకట్టుకుంది. ‘‘ఒక్కసారి మీ కుటుంబాల గురించి ఆలోచించండి..మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల బాధ్యతను గుర్తుంచుకుని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించండి. ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు" అని యువతకు సూచించారు పోలీసులు. 

ఈ ఘటన ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లంఘన, నిర్లక్ష్యపు డ్రైవింగ్​, రేసింగ్, ట్రిపుల్‌ రైడింగ్‌, ఓవర్‌స్పీడ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ వంటి ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై చర్చకు దారి తీసింది.  నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలతో అనేక కుటుంబాలలో విషాదం నెలకొంటున్నది. అటువంటి పరిస్థితి రానీయకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలన్న అవేర్​ నెస్​ ప్రోగ్రామ్స్​ పోలీస్​ యంత్రాంగం నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది.  

ఇలాంటి ఘటనలు పెరుగుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు, ట్రాఫిక్​ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్​ రూల్స్​అతిక్రమిస్తే డ్రైవింగ్​ లైసెన్స్​ రద్దు చేయడం, వెహికల్​ నంబర్ రద్దు చేయడం, భారీ జరిమానాలు వంటి కఠిన చర్యలు చేపడుతున్నారు. తాత్కాలిక ఆనందం కోసం స్పీడ్ గా బైక్​ డ్రైవింగ్​ చేయడం తన ప్రాణాలతోపాటు ఇతరు ప్రాణాలను పణంగా పెట్టడం యువత మానుకోవాలని.. ట్రాఫిక్ రూల్స్​ పాటించాలని ట్రాఫిక్​పోలీసులు పదే పదే సూచిస్తున్నారు.